నెల్లూరు : ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుకుంటున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని ముత్తుకూరు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా పోరుమామిళ్ళకు చెందిన కె.మధుసూధన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగ్గా లేనందునే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే విద్యార్థి సంఘాలు దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి మృతిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.