గుత్తిలో మెగా జాబ్ ఫెయిర్
అనంతపురం : రాష్ట్ర చరిత్రలో పేరు మోసిన 15 కంపెనీలు కలిసి తొలిసారిగా మెగా జాబ్ ఫెయిర్ ను అనంతపురంజిల్లా గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 18న నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువతీయువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోహెరెన్స్ కన్సల్టెంట్ ఎం.రవి, గేట్స్ కరస్పాండెంట్ వి.కె.సుధీర్ రెడ్డి, ప్రిన్సిపాల్ రమేష్ లు కోరారు. గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ 15 ప్రముఖ కంపెనీలు ప్రపథమంగా మెగా జాబ్ ఫెయిర్ ను ఇక్కడ నిర్వహిస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఐదారు కంపెనీలు మాత్రమే కలిసి జాబ్ మేళాను నిర్వహించాయినీ, 15 కంపెనీలు కలిసి ఒకే చోట మోగా జాబ్ మేళాను నిర్వహించడం ఇదే ప్రధమం అని తెలిపారు.
ఇన్ఫోసిస్, హెచ్ సీ ఎల్, సదరన్ లాండ్, విప్రో, బాక్సిస్ లిమిటెడ్, ఫస్ట్ సోర్సు, శ్రీరాం చిట్స్, ఏఈజీఐఎస్, స్టాండర్డు చార్టర్ బ్యాంకు ఇండియా ఇన్ఫోలైన్, బిర్లా సన్ లైన్, కపిల్ చిట్స్ శ్రీరామ్ ఇన్వెస్టుమెంట్, జనచైతన్య ఇవ్వెస్టుమెంటు కంపెనీలు ఉమ్మడిగా ఈ మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించబోతున్నారు. ఈ జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. బిఏ, బికాం, బిఎస్ సీ, బిటెక్, ఎంబీఏ, ఎంసిఏ, ఎంకామ్, ఎంఏ, చివరకు ఇంటర్మీడియట్ చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు కూడా ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. 30 సంవత్సరాల వయస్సు దాడి ఉండకూడదన్నారు.
2005 తర్వాత డిగ్రీ పూర్తి చేసినవారు మాత్రమే అర్హులని చెప్పారు. ఎంట్రీ ఫీజు కేవలం రూ.20గా నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన అభ్యర్ధులైనా జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. దూర ప్రాంతాల నుండి వస్తున్న అభ్యర్థుల కోసం గుత్తి బస్టాండు, రైల్వే స్టేషన్ల నుండి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో అధ్యాపకులు శ్రీనివాసరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 16 July, 2009
|