టిడిపి నేత దారుణ హత్య
అనంతపురం : జిల్లాలో మరోసారి ప్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. టిడిపి నేత రంగయ్యను శుక్రవారం అతి దారుణంగా వేటకొడవళ్ళతో నరికి చంపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం, హుసేనాపురం మాజీ సర్పంచ్ రంగయ్యను విజయబార్ సమీపంలో ప్రత్యర్థులు వేటకొడవల్లతో దారుణంగా నరికి చంపిన ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగయ్య ఇటీవలె కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి చేరారు.
News Posted: 24 July, 2009
|