అనంతపురం : అనంతపురంలో జిల్లాలో ఫ్యాక్షనిజం పడగవిప్పింది. టిడిపి నేత దారుణ హత్య జరిగి ఎంతో సమయం గడవకముందే కాంగ్రెస్ కార్యకర్తపై ప్రత్యర్థులు దాడులకు పాల్పడ్డారు. తాడిపత్రిలో కాంగ్రెస్ నేత ఓబుల్ రెడ్డిని ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో దాడి చేశారు. తాడిపత్రి మెయిన్ రోడ్డులో ఆయనపై మారణాయుధాలతో దుండగులు విరుచుపడ్డంతో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఓబుల్ రెడ్డి పుట్లూరు మండలం చాలవేముల మాజీ సర్పించి. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.