ఏసీబీ వలలో డీఎంహెచ్ వో
నిజామాబాద్ : నిజామాబాద్ డీఎంహెచ్ వో రామమూర్తి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు శుక్రవారం దొరికిపోయారు. ఓ ట్రాన్స్ ఫర్ కేస్ లో డీఎంహెచ్ వో రామమూర్తి 3, 500 రూపాయలను డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని లంచం తీసుకుంటున్న డీఎంహెచ్ వో రామమూర్తిని అదుపులోకి తీసుకున్నారు.
News Posted: 7 August, 2009
|