పండుగలకు ప్రత్యేక రైళ్లు
కాకినాడ : వరుసగా మూడు రోజులు పబ్లిక్ సెలవులు రావడంతో ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది. ఆర్టీసీ శాఖ కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు కాకినాడ డిపో మేనేజర్ బి.నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజు కాకినాడ - హైదరాబాద్ కు 11 సర్వీసులు నడుపుతున్నామని, సెలవుల నేపథ్యంలో మరో రెండు సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. విఖాఖపట్నానికి ప్రతి అరగంటకు ఒక బస్సు కాకినాడ డిపో నుండి వెళ్తుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చివెళ్ళే ప్రయాణీకుల కోసం సర్వీసులు పెంచే ఆనలోచన ఉందని ఆయన చెప్పారు. అలానే రైల్వేశాఖ కూడా కాకినాడ- సికింద్రాబాద్కు ప్రత్యేక రైళ్లను వేసింది. 14, 15 16 తేదీల్లో రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు మరునాడు ఉదయం 8.30కు కాకినాడ చేరుతుంది. అలాగే ఇవే తేదీల్లో రాత్రి 9 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరే ప్రత్యేక రైళ్లు మరునాడు 8 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఇవిగాక 16వ తేదీ రాత్రి 7 గంటలకు రాజమండ్రి నుంచి ప్రత్యేక రైలు బయలు దేరుతుంది. ఇది మరునాడు తెల్లవారు జామున 4.30కు సికింద్రాబాద్ చేరుతుంది.
News Posted: 13 August, 2009
|