అనంతపురం : అనంతపురం జిల్లాలో ఏడో నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా మరో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కర్నూలు నుంచి అనంతపురం వస్తండగా లోలూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొనటంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్సీ సహాయక చర్యలను పర్యవేక్షించారు.