స్కూల్ బస్ బోల్తా
నెల్లూరు : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ స్కూల్ బస్ బోల్తా పడడంతో ఉపాధ్యరాయులు చనిపోగా, విద్యార్థులు గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పుగుడ్లదొన సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో టీచర్ మృతి చెందగా, ఇరవై అయిదు మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన చిన్నారులను చికిత్సకోసం సమీప ఆస్పత్రికి తరలించారు.
News Posted: 19 August, 2009
|