అందరికీ హోమియో మాత్రలు
ఏలూరు : ప్రజలను కలవరపెడుతున్న స్వైన్ ఫ్లూ వ్యాధిని నివారణకు హోమియో మందుల పంపిణీని ఉండి ఎమ్మెల్యే శివరామరాజు స్థానిక శివ స్వచ్ఛం సేవా సంస్థ కార్యాలయంలో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయిదుగురికి సరిపోయే మాత్రలనున్న ప్యాకెట్ ను ప్రతి కుటుంబానికి ఉచితంగా రెండు రోజుల్లో అందజేస్తామని తెలిపారు. వీటిని మూడు నెలలలోపు గర్బిణీలు వాడకూడదని చెప్పారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించే కరపత్రాలను ప్రతి కుటుంబానికి అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వంతోపాటు స్వచ్ఛం సేవ సంస్థలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మాత్రల తొలి ప్యాకెట్ ను వాండ్రం టీడీపీ అధ్యక్షుడు కందుల బలరాముడుకు ఎమ్మెల్యే ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉండి, కాళ్ళ, పాలకోడేరు మండల టీడీపీ అధ్యక్షులు పొత్తూరి వెంకటేశ్వరరావు, బండారు వేణుగోపాలరావు, మంతెన సూరిబాబు, ప్రజాప్రతినిధులు పిన్నమరాజు శ్రీనివాసరాజు, కోపెల్ల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 31 August, 2009
|