కరీంనగర్: కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద భారీ ఎత్తున వర్షపు నీరు చేరడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఖాజేపేట - న్యూఢిల్లీ మార్గంలో నడిచే రైళ్ళను నిలిపేశారు. జమ్మికుంట రైల్వే స్టేషన్లో రామగిరి ప్యాసింజర్ నిలిపివేశారు. పరిస్థితిని రైల్వే అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రైళ్ళు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందలకు గురవుతున్నారు.