నోట్లతో గణపతి మందిరం
రాజమండ్రి : అప్పనపల్లిలో ప్రతిష్టించిన ఎనిమిది అడుగుల గణనాధుని విగ్రహానికి 1.30 లక్షల రూపాయలతో గణపతినీ, మందిరాన్ని వినాయక ఫ్యాన్సీ వర్తక సంఘం సర్వాంగ సుందరంగా అలంకరించారు. కొన్ని కోట్ల కట్టలను దండలుగా చేసి గణనాథునిమెడలో వేశారు. ఐదు, పది యాభై, వంద, ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లతో గణపతి మందిరాన్ని అలంకరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గణపతి మందిరాన్నినోట్ల కట్లతో అలంకరించిన తీరు అమితంగా ఆహుతులను ఆకట్టుకుంది. గణపతిని దర్శించిన భక్తుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. భారీ ఎత్తున అన్నదాన సమారాధన కూడా నిర్వహించారు.
News Posted: 2 September, 2009
|