సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు
నెల్లూరు : హెలికాప్టర్ ప్రమాదం లో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డితోపాటు దుర్మరణం పాలైన ప్రత్యేక కార్యదర్శి పి.సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని రైల్లో నెల్లూరుకు తరలించారు. రైల్వే స్టేషన్లో నే ఆయన భౌతిక కాయానికి జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్, జాయింట్ కలెక్టర్ సౌరభగౌర్, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ యుగంధర్ తదితురులు సందర్శించి నివాళులర్పించారు. స్వగ్రామమైన గుడపల్లిపాడు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయిం ది. సిఎం ప్రత్యేక కార్యదర్శి పొంతగుంట సుబ్రహ్మణ్యం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గుడపల్లిపాడు గ్రామంలో జన్మించారు. తన గ్రామానికి ఎంతో కొంత మేలు చేయాలనే తలంపుతో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో చదువుకున్న నిరుద్యోగులు 70 మందికి ఆయన ఉద్యోగావకాశాలు కల్పించి అనేక కుటుంబాల ఉన్నతికి బాటలు వేశారు.
News Posted: 4 September, 2009
|