కరీంనగర్ : ప్రజారాజ్యం పార్టీ జిల్లా కన్వీనర్ పదవి కోరుట్ల నియోజకవర్గానికి దక్కింది. కన్వీనర్ గా డాక్టర్ జెఎన్ వెంకట్ ను నియమించినట్లు పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. ఇబ్రహీం పట్నానికి చెందిన ఆయన కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం మెట్ పల్లిలో స్థిరపడి అక్కడే ఆసుపత్రి నిర్వహిస్తారున్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రాష్ట్ర కార్యవర్గాన్నిఆదివారం నాడు ప్రకటించారు. అలానే పదిహేను జిల్లాలకు అధ్యక్షులను కూడా నియమించారు. త్వరలోనే మిగతా జిల్లాల అధ్యక్షులను నియమిస్తామని ఆయన మీడియాకు వెల్లడించారు. సీనియర్ నాయకుడు పర్వతనేని ఉపేంద్ర సారధ్యంలోని స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన జాబితాను ఆయన విడుదల చేశారు. రాష్ట్ర కమిటీలో ఏడుగురు ఉపాధ్యక్షులతో పాటు తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులను నియమించారు.