బాబా సన్నిధిలో దశమి వేడుకలు
అనంతపురం : దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు జరుపుకోవడానికి దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు పుట్టపర్తికి తరలివచ్చారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా పలు ఆథ్యాత్మిక బోధనలు చేశారు. ప్రస్తుతం పుట్టపర్తి అంతర్జాతీయ చిత్రపటంలో ప్రముఖ ఆథ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందిందని, పుట్టపర్తి మరింత అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల్లోనే చరిత్ర కెక్కుతుందని బాబా పేర్కొన్నారు.
News Posted: 29 September, 2009
|