2 నుంచి గుర్తింపు కార్డులు
రాజమండ్రి : అక్టోబర్ రెండవ తేదీ నుంచి నిర్మాణ రంగ కార్మికులకు గుర్తింపు కార్డు ఇవ్వనున్నట్లు కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ ఎస్.గోపాల్ తెలిపారు. ఈ కార్డుల జారీ నిమిత్తం రాష్ట్రంలో ఇంత వరకు 4.5 లక్షల మంది కార్మికుల పేర్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నాటికి 20 లక్షల మంది కార్మికులకు ఈ గుర్తింపు కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రాజమండ్రిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు కూడా ఈ గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. కార్మిక సంఘం, సూపర్వైజర్, సబ్ కాంట్రాక్టర్ ఎవరైనా ధృవీకరణ పత్రం ఇస్తే కార్మికుని పేర్లు రిజిస్టర్ చేస్తామన్నారు.
News Posted: 30 September, 2009
|