ముంపు గ్రామాల్లో జగన్ పర్యటన
కడప : జిల్లాలో నాలుగు రోజులుగా ఏర్పడ్డ వరద ఉధృతి వల్ల కర్నూలు అతలాకుతలమైంది. కుందూనది వరదతో అతలాకుతల మైన కడప జిల్లాను సందర్శించేందుకు కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజులు పర్యటించనున్నారు. నియోజకర్గం పరధిలో ముంపుకు గురైన గ్రామాల్లో ఆయన సోమవారం, మంగళవారం పర్యటిస్తారు. పెద్దముడియం మండలం పాలూరు నుంచి ప్రారంభించి ఏడు గ్రామాల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. బాధితులకు అందున్న సహాయ కార్యక్రమాలు, పునరావాస పనులను ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు పెద్దముడియం గ్రామాలతో పాటు, రాజుపాళెం, దువ్వూరు, చాపాడు మండలాల పరిధిలోని ముంపు గ్రామాలను కూడా పర్యటిస్తారు.
News Posted: 5 October, 2009
|