కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థలతోపాటూ అన్ని పురపాలక సంఘాలనూ పీడిస్తున్న చెత్త సమస్యకు పరిష్కారం దొరకడం కష్టమవుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న జనాభా.. ఫలితంగా పేరుకుపోతున్న చెత్త.. ఎక్కడ డంప్ చేయాలో తెలీక నగరపాలకులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలలోనూ డంపింగ్ యార్డులు చెత్తతో పూడుకుపోయాయి. అక్కడ ఇక చెత్త డంప్ చేయడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. దీంతో జాతీయ రహదారికి రెండువైపులా చెత్తను వేస్తున్నారు.