'వండిన పదార్థాలు వద్దు'
కర్నూలు : వరద బాధితులకు వండి ఆహార పదార్థాలను తీసుకురావద్దని కర్నూలు, పాలమూరు కలెక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న వండిన ఆహారం బాధితులకు చేరే సరికి కుళ్ళిపోయి తినడానికి పనికిరాకుండా పోతోందన్నారు. ఆకలి బాధను తట్టుకోలేక ఆ చెడిపోయిన ఆహారాన్నే బాధితులు తినడం వల్ల వారు డయేరియా వంటి వ్యాధులకు గురవుతుండడంతో వండిన ఆహార పదార్థాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిషేధం విధించారు. స్వచ్ఛంద సంస్థలు వండిన ఆహారాన్ని తీసుకొచ్చినా పునరావాస కేంద్రాల ఇన్ చార్జ్ లు చెక్ చేసిన తర్వాత బాధితులకు అందించాలని వారు స్పష్టం చేశారు. బాధితులకు ఆహారం తీసుకొచ్చే స్వచ్ఛంద సంస్థలు పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు... అలా నిల్వ ఉండే ఆహార పదార్ధాలను, వంట సామాగ్రిని అందజేయవచ్చని వారు తెలిపారు.
News Posted: 6 October, 2009
|