కర్నూలు : కర్నూలు జిల్లా బండి ఆత్మకూరులోవరద బాధితులకు ఆహార పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం బండి ఆత్మకూరులో వరద బాధితులకు ఆహార పంపిణీ జరుగుతుండగా తొక్కిసలాట జరిగింది. వరద సాయం అందటం లేదంటూబాధితులంతా తిరగబడడంతో ఓ వ్యక్తి గాయపడ్డాడు. దాంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.