3అనాధలకు విద్య సాయం: బాబు
కర్నూలు : వరదల వల్ల తల్లితండ్రులను కోల్పోయి అనాధలైన ముగ్గురి పిల్లలకు జీవితంలో స్థిరపడేంతవరకు అవసరమైన విద్యను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నట్లు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లా నాగుల దిన్నె గ్రామంలో మొన్నటి వరదలకు వడ్డె యల్లప్ప, వడ్డె వసూరమ్మ దంపతులు కన్నుమూశారు. వీరి మృతితో పదేళ్ళ ఆంజనేయులు, ఆరేళ్ల జంజన్న, పదకొండేల్ల పద్మలు అనాధలయ్యారు. వీరందరిని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో ఉంచి విద్యను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
News Posted: 20 October, 2009
|