డిసెంబర్ లో రెండే రైల్వేస్టేషన్
కాకినాడ : కాకినాడ-సామర్లకోటల మధ్య 30 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసుకున్న రెండవ రైల్వేస్టేషన్ ను డిసెంబర్ లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏడీఆర్ఎం జయరాజు వెల్లడించారు. రామచంద్రాపురం, సామర్లకోట, కాకినాడ ర్వైల్వేస్టేషన్ల నిమిత్తం ఆయన బుధవారం సామర్లకోటకు విచ్చేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లైన్ ప్రారంభంతో గూడ్స్ లైన్ ట్రాఫిక్ కు ఎటువంటి అవాంతరాలు ఉండవని తెలిపారు. కాకినాడ నుంచి నేరుగా విశాకకు ప్రత్యేక సైడ్ లైనింగ్ నిర్మాణం వల సామర్లకోట స్టేషన్ లో ట్రాఫిక్ కు అంతరాయం ఉండదన్నారు.
News Posted: 22 October, 2009
|