28న కార్మికుల నిరసన
కాకినాడ : జాతీయ స్థాయిలో కార్మికుల నిరసన ప్రదర్శనను ఈ నెల 28న నిర్వహిస్తున్నామని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. కార్మిక, ఉద్యోగ వర్గాలు ఎదుర్కొంటున్న మౌలకి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు వారు తెలిపారు. కాకినాడ సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వివరించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిర్ల కృష్ణారావు మాట్లాడుతూ సుమారు ఇరవై సంవత్సరాల తర్వాత జాతీయ కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి కార్మిక, ఉద్యో వర్గాల సమస్యలపై స్పందించడం శుభపరిణామమని అన్నారు. ఐఎన్ టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి పిలుపు మేరకు తమ సంఘం ఈ ఉద్యమంలో పాల్గొంటుందని, దానికి తమ వంతు సహకారం అందిస్తామని సంఘం జిల్లా అధ్యక్షుడు జోషీ మద్దతు పలికారు.
News Posted: 27 October, 2009
|