విద్యార్థులను బలిగొన్న ఆర్టీసీ
అనంతపురం : ఆర్టీసీ బస్సు విద్యార్థులను ఢీకొనడనంతో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం జిల్లాలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు నార్పుల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద అదుపు తప్పి రోడ్డుపై నిలబడి ఉన్న విద్యార్థులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. రాజేష్, సురేష్, రాము అనే ముగ్గురు విద్యార్థులు ఈ ప్రమాదంలో మరణించినట్లు గుర్తించారు.
News Posted: 6 November, 2009
|