ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పాలకొల్లుకు చెందిన రాము అనే ఖైదీ ఆత్మహత్యకు పూనుకోవడంతో వెంటనే గమనించిన ఇతర ఖైదీలు అధికారులకు సమాచారం అందించారు. జైలు అధికారులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.