ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు-కొవ్వూరు సమీపంలో రైలు పట్టా విరగడంతో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విజయవాడ - విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తున్న దారిలో రైలు పట్టా విరిగిపోవడంతో పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది రైల్వే ట్రాక్ మరమ్మతులు చేపడుతున్నారు.