అనంతపురం : అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఛైర్మన్ కు వ్యతిరేకంగా ఆ పార్టీ సభ్యులే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కదిరి మున్సిపల్ చైర్మన్ పర్హానా బేగంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె పదవిని కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 32 మంది కౌన్సిలర్లు ఆమెకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చారు.