ఫూజారి హత్య-హుండీ దోపిడి
నెల్లూరు : నమ్మిన దైవానికి నిత్యం ధూప దీపాలను వెలిగించి, నైవేధ్యాన్ని పెట్టే పూజారి ఆ కృష్ణునికోసం తన ప్రాణాలనే నైవేధ్యంగా సమర్పించాడు. జిల్లాలోని దుత్తలూరులో కృష్ణ మందిరంలో విగ్రహాలను చోరీ చేసేందుకు దుండగలు ప్రయత్నించగా పూజారి పెంచలయ్య ఆలయ విగ్రహాలు అపహరణకు గురికాకుండా అడ్డు పడ్డాడు. దీంతో దుంగడగులు విగ్రహాలను వదిలివేసి... పూజారి ప్రాణాలను హతమార్చి హుండీతో పరారయ్యారు. గురువారం అర్థరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు విగ్రహాల చోరికీ ప్రయత్నించడంతో పూజారి తన ప్రాణాలనే పణంగా పెట్టి విగ్రహాలు అపహరణకు గురికాకుండా కాపాడుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
News Posted: 27 November, 2009
|