కరీంనగర్ : తెలంగాణకు మద్దతుగా నిరసన చేపట్టిన ఆందోళనకారులు రైలు రోకో చేపట్టారు. దీంతో పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కమలాపురం మండలం ఉప్పల్ రైల్వేస్టేషన్ లో తెరాస కార్యకర్తలు చేపట్టిన రైలురోకో వల్ల ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.