కేతిరెడ్డి దీక్ష భగ్నం
అనంతపురం : సమైక్యాంధ్రకు మద్దతుగా గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు కేతిరెడ్డి దీక్షను మంగళవారం భగ్నం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి పోలీసులను ప్రతిఘటించారు. అరుపులు, నినాదాలతో వారంతా రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
News Posted: 22 December, 2009
|