వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు
కర్నూలు : కర్నూలు జిల్లా అహోబిలం క్షేత్రంలో నిర్వహించే వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మేనేజర్ నరసయ్య తెలిపారు. ధనుర్మాసం సందర్భంగా తెల్లవారు జామున 3 గంటలకే పూజలు నిర్వహిస్తున్నామనీ, సోమవారం తెల్లవారు జామున 4 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శన ప్రవేశం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా గరుడోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
News Posted: 26 December, 2009
|