కరీంనగర్ : జిల్లాలోని ఎలిగేడు బిఎస్ఎన్ఎల్ టవర్ కంట్రోల్ రూమ్ కు తెలంగాణ ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీనితో కంట్రోల్ రూమ్ పాక్షికంగా దగ్ధం అయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదాలు చేస్తూ కొందరు ఆందోళనకారులు కొద్దిరోజులుగా జిల్లాలోని పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడుతున్నారు.