రాజీనామా చేయండి
కరీంనగర్ : తెలంగాణ మంత్రులు, నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని తెలంగాణ ప్రాంత రచయితల వేదిక డిమాండ్ చేసింది. సోమవారం ఆ వేదిక అధ్యక్షుడు జూకంటి జగన్నాథం విలేకరులతో మాట్లాడారు. నేతలంతా దిష్టు బోమ్మలగా మిగిలిపోకుండా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. పదవులకు రాజీనామాలు చేయకుంటే నేతలను రోడ్లపై తిరగనివ్వమని హెచ్చరించారు. అన్ని పార్టీలు నేతలు ఉద్యమంలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.
News Posted: 4 January, 2010
|