కర్నూలు : కేసీ ఆయకట్టు పరిధిలో సాగుతున్న పంటలకు తెలుగు గంగ నుండి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భానకచెర్ల నీటి నియంత్రణ వ్యవస్థ సముదాయం నుండి కేసీ కాల్వకు ఎస్కేవ్ ఛానల్ ద్వరా నీటిని దిగువుకు పంపిస్తున్నారు. ఈటీవల వర్షాభావ పరిస్థితుల కారణంగా పాములపాడు ప్రాంతంలో పంటలు ఎండిపోయాయి. అయితే రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తెలుగు నీటిని విడుదల చేస్తుంది.