సస్పెన్షన్ నిలిపివేత
కడప : ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి అరెస్ట్ వ్యవహారంలో సస్పెన్షన్ కు గురైన పోలీసులపై ప్రభుత్వం సస్పెన్షన్ ను ఎత్తివేసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వివేకాను పోలీసులు అరెస్ట్ చేసారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు దాదాపు రూ. 16 కోట్ల విలువైన ఆస్తులను ధ్వంసం చేసారు. దీంతో ప్రభుత్వం సీఐ జి. వి. రమణ, ఎస్సై పార్థసారథి రెడ్డి, ఏఆర్ ఎస్సై దొరస్వామి నాయక్ లతో పాటుగా కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేసింది. అయితే పోలీసు అధికారుల సంఘం రంగంలోకి దిగి ప్రభుత్వంతో చర్చలు జరపడంతో సస్పెన్షన్ ను నిలిపివేసారు.
News Posted: 5 January, 2010
|