కాకినాడ : యానాంలో ప్రజా ఉత్సవాలు ఆంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యలింగం ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య కూడా హాజరయ్యారు. ప్రతీ ఏటా జనవరిలో యానాం ప్రజలు ఈ ఉత్సవాలను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన వీక్షకులను విశేషంగా అలరించింది.