కడప : ఎంపీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం కడప జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన పులివెందుల చేరుకున్నారు. అక్కడ నుండి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నాగశేషురెడ్డి స్వగ్రామం కర్ణపాపాయపల్లెకు వచ్చారు. ఆయన కుమార్తె మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుధవారం కడప నగరంలో జగన్ దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.