తిరుపతి : శ్రీనివాస మంగాపురంలో కల్యాణ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభ సూచికగా శుక్రవారం ధ్వజారోహణం జరిగింది. ధ్వజస్తంభానికి గరుడ పటాన్ని ఎగరేసి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. ఈ ఉత్సవాలు 13 తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు కల్యాణ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు ఉత్సవాల్లో టిటిడి ఈఓ కృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.