తిరుమల : తిరుమలలో ఆలయ భద్రతా వ్యవహారాలపై రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. తన కుమారుడు కార్తీక్ రెడ్డితో కలసి ఆమె కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు. ఆలయ అధికారులు హోంమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయ భద్రతపై సమీక్ష జరిపారు. తిరుమలలో ఔటర్ సెక్యూరిటీ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లిడించారు. అలాగే ఆలయ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు స్పెషల్ బ్రాంచ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.