గుంటూరు : నిధులు లేమితో అర్దాంతరంగా నిలిచిపోయిన ప్రాజెక్టులని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి గాదె వెంకట రెడ్డి వెల్లడించారు. ప్రాజెక్టులు పూర్తియ్యేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలో అభివృద్ది కార్యాక్రమాలు చేపట్టేందుకు ప్రపంచ బ్యాంకు నుండి 5 కోట్లు రూపాయలు కేటాయించే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయిస్తానని చెప్పారు.