విజయవాడ : యశ్వంత్ పూర్ - లక్నోల మధ్య కొత్త రైలును ప్రవేశపెడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి విజయ్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 6503 నంబరు గల యశ్వంత్ పూర్ నుంచి లక్నో వెళ్లే రైలు రాత్రి 12 :15 గంటలకు విజయవాడ చేరుతుందని పేర్కొన్నారు. ఇక్కడ నుండి 12:25 గంటలకు మళ్లీ పయనమై లక్నోకు మరునాడు ఉదయం 10 గంటలకు చేరుతుందని తెలిపారు.