తెలుగుకు అవమానం
విజయవాడ : ప్రైవేటు పాఠశాలలో తెలుగు భాషకు మరోసారి అవమానం జరిగింది. నగరంలోని సింగ్ నగర్ కు చెందిన క్రైస్తవ మిషనరీకి చెందిన పాఠశాలలో గురువారం ఈ ఘటన జరిగింది. క్లాసు రూమ్ లో తెలుగు మాట్లాడినందుకు ఆ పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థి యామిని పట్ల దారుణంగా వ్యవహరించింది. తోటి విద్యార్థుల ముందు బట్టలు ఇప్పించి అర్థనగ్నంగా నిలబెట్టింది. దీంతో కలత చెందిన యామిని జరిగిన ఘటనను తన తల్లితండ్రులకు వివరించింది. యామిని తండ్రి తీవ్ర ఆగ్రహంతో పాఠశాలకు వెళ్లి స్కూలు టీచర్ తో వాగ్వాదానికి దిగాడు. దీనిపై స్పందించడానికి టీచర్ , స్కూలు యాజమాన్యం నిరాకరించారు.
News Posted: 25 February, 2010
|