నిజామాబాద్ : జిల్లాలోని నవీపేట మండలం నాగేపూర్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డీసీఎం వ్యాను బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.