బోనెక్కిన సల్మాన్ ముంబాయి : 'చోరీ చోరీ చుప్కే చుప్కే' సినిమాకు తక్కువ పారితోషికం తీసుకోవాలంటూ తనకు వచ్చిన బెదరింపుల కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురువారం కోర్టు బోనులో సుమారు అరగంటసేపు నిలబడ్డాడు. మాఫియా డాన్ చోటా షకీల్ ప్రధాన అనుచరుడు అంజుమ్ ఫజలానీని ఈ హెచ్చరికలు చేసినట్లు అభియోగం. ఈ కేసులు సల్మాన్ ఖాన్ ను పోలీసులు ముఖ్య సాక్షిగా 'మోకా' ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. అయితే, తనను బెదరించిన వ్యక్తి ఫజలానీని సల్మాన్ గుర్తించలేకపోయాడు. ఈ సందర్భంగా బోనులో సల్మాన్ కోర్టు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఫజలానీని చాలా ఏళ్ళ క్రితం ఒక సారి కలిసినట్లు సల్మాన్ చెప్పాడు.
News Posted: 11 March, 2010
|