బెర్తులపై మాజీల ఆశలు! హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ పునర్వవస్ధీకరణ పైన మంత్రులు, ఎమ్మెల్యేల మధ్యన ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మార్పులు చేర్పులు అనివార్యం అని అత్యధికులు భావించారు. మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు యువ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కె. రోశయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇద్దరు ముగ్గురు మాజీలు కూడా మంత్రిపదవుల పై ఆసక్తిని కనబరిచారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు సీనియర్ మాజీ మంత్రులు మంత్రివర్గ పునర్వవస్ధీకరణపై అత్యంత ఆసక్తిని కనబరిచారు.
ముఖ్యమంత్రిగా రోశయ్య ఆరు మాసాల క్రితం బాధ్యతలు స్వీకరించినప్పటీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు చేయకుండానే పరిపాలన సాగిస్తున్నారు. రాజశేఖర రెడ్డి మంత్రివర్గం రోశయ్యకు సహకరించడం లేదని ప్రచారం జరిగింది. తామంతా సమిష్టి బాధ్యతలో ఉన్నామని, ముఖ్యమంత్రికి సహకరించడం లేదనేది ప్రచారమే తప్ప వాస్తవం కాదని పలువురు మంత్రులు బహిరంగంగా ప్రకటించారు. కొందరు మంత్రులు రాజీనామా చేయడం, మరి కొందరు సహయ నిరాకరణ పాటించడం లాంటి పరిణామాలపై కూడా చర్చ జరిగింది.
Pages: 1 -2- News Posted: 13 March, 2010
|