'రోశయ్య, బాబు కుమ్మక్కు' కరీంనగర్: రోశయ్య, చంద్రబాబు కుమ్మకై అసెం బ్లీని నడిపిస్తున్నారని, చచ్చినా బతికినా తన అంతిమ లక్ష్యం తెలంగాణా సాధనే అని తెరాస అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్ జిల్లాలోని కోరుట్లలో తెలంగాణ ఆత్మ గౌవర సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవసరమైతే రాష్ట్ర సాధన కోసం నేను ప్రాణాలైన బలిపెడుతానన్నారు.
కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, మేధావులు అందరు ఏకమై ఉద్యమాన్ని కొనసాగిం చాలన్నారు. కెసిఆర్ శవయాత్రనా తెలంగాణ జైత్రయాత్రన అని తాను అమరణ దీక్షకు దిగితే కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటనను చేసిందని అయితే 24 గంటలు కూడా సీమాంధ్రులు తమను సంతోషంగా ఉంచలేదన్నారు.
News Posted: 13 March, 2010
|