Active Blogs | Popular Blogs | Recent Blogs ===============================================================================================
ఇక డ్రెస్ అవన్నీ చేసుకొని..
మళ్ళా పూజ గదిలోకి వొచ్చి...
బాబా పాదాల పై ఉన్న గంధాన్ని..ఇంక కొంచెం గంధాన్ని పాదాలపై పూసి..
ఆ బొట్టు పెట్టుకొని..కొంచెంగా భాస్కర తేజమైన ఎర్రని కుంకుమ మధ్యలో భక్తిగా అద్దుకొని
( గందానికి బృహస్పతి అధి దేవత..తేజానికి పరాక్రమానికీ , ప్రతీక అయిన గ్రహరాజు సూర్యుణ్ణి ప్రతిష్ఠించుకున్నట్లుగా భావించాలి )
హి భగవాన్ !! నీ పాద గంధాన్ని నా నుదుటికి బొట్టుగా దిద్దుకొనే అదృష్టం కలిగించావు ,
నా జీవితాన్ని దిద్దే బాధ్యతే నీదే సుమ్మీ...నీకు అలంకరించిన గంధాన్ని ప్రాపంచిక సుఖాల ఆశించి నేను బొట్టు పెట్టుకున్నానని అలగకు, ఆగ్రహించకు తండ్రీ.. మా నాన్నవు కదూ........
నా ఈ అపరాథానికి క్షమించు తండ్రీ..
కానీ ఇందులో నా స్వార్థమేమిటీ అంటే …ఆ గందానికి అబ్బిన సుఖం, సుగంధం, నీదు పవిత్ర పాదపరిష్వమ్గనా .పుణ్యం నేను కూడ పొందాలనే స్వామి అంతే కానీ ధిక్కరించి కాదు దేవ దేవా...
మన్నించు తండ్రీ.. మరి నా వృత్తి బాధ్యత నిర్వహణకు వేళ అవుతుంది ప్రభూ...
దయతో, అనుమతించు తల్లీ...
ఉద్యోగ వ్యాపారాదుల నిర్వహణలో నాకు ఒచ్చే ఆటంకాలు, తదితర కష్ట నష్టాలను తొలగించి
నా జిహ్వపై అను క్షణం నీ నామ సంకీర్తన భక్తి తో కొంత సేపైనా చేసుకొనే విధం గా అనుగ్రహించు మహా దేవా...
ఈ రోజు నాకు ఒచ్చే ఆపదల అన్నిటి నుండీ కాపాడు, గట్టెక్కించు స్వామీ..
నా కుటుంబ పోషణార్థం ఈ జీవి దేహాన్ని కాపాడు స్వామీ..
ఈ రోజు శుభ ప్రదంగా , మంగళ ప్రదంగా ఉండేలా చూడు తండ్రీ...
కర్మ వశాత్తు..నేను చేసిన పాప కర్మల భారం నేనే స్వీకరించాలని... ఎరుగుదును తండ్రీ
అనుభవించాలని...
మేము చేసే పుణ్యం మేము చేసిన పాపాలను నిర్మూలించలేదు అనీ ఎరుగుదును తండ్రీ..
న్యాయంగా , ధర్మం గా నేను అనుభవించాల్సినది అనుభవించక తప్పదని ఎరుగుదును తండ్రీ..
కానీ ప్రార్థించడం , మన్నింపు వేడటం మా కర్తవ్యం ప్రభూ...
ఈ జీవి వాచాలతను క్షమించి, పాలించండి.. అనుజ్ఞ ఇవ్వండి
అని ముమ్మారు నమస్కరించుకొని బయటకు వెళ్ళాలి..
…..
ఇక విధి నిర్వహణ నుండి ఇంటికి వచ్చాక..
చక్కగా స్నానం చేసి..
ఆ రోజంతా...మనం చేసిన తప్పులకూ, పాపాలకూ..
చేసిన ఒక్కొక్క తప్పు కళ్ళ ముందుకు తెచ్చుకొని బరువైన నిట్టూర్పుల తో.. పశ్చాత్తాపాగ్ని లో మన మనస్సును జలకాలాడించాలి
తొందర లేకుండా..ఒక్కొక్క తప్పు గుర్తుకు తెచ్చుకొని.. బరువెక్కిన గుండె తో..ఆ తప్పులు మళ్ళా జరగవని హామీ ఇచ్చి క్షమాపణ వేడాలి..
( కర చరణ కృతం వా ……….. కు..తెలుగు సేత )
హి మహా దేవా..గురుదేవా..సమర్థ సద్గురూ సాయినాథ్ మహారాజ్...
ఈ దేహి..ఈ జీవి..నీవు దయ తో అనుగ్రహించిన ఆయువు లో.. ఈ దినం…… (బరువైన నిట్టూర్పు ) అను క్షణం
నీవు నన్ను గమనిస్తున్నావన్న సత్యం మరచి (బరువైన నిట్టూర్పు)
ఈ మాయా ప్రపంచం లో ..
ఈ పాపిష్టి కళ్ళతో చేసిన పాపాలు..చూసిన పాపాలు ( ఒక్కొక్క తప్పుకూ పశ్చాతాపం తో బరువైన నిట్టూర్పు ఇవ్వాలి..ఆ దృశ్యం కళ్ళ ముందు కదలాడాలి.. )
ఈ శ్రవణాలు విన్న పాపాలు.. ( విన్న ఒక్కొక్క అపశబ్దమూ గుర్తుకు తెచ్చుకోవాలి
లేదా..
ఆ సమయమునందే మన చెవుల మూసుకోవడం , ఒక నిట్టూర్పు ఇవ్వడం చెయ్యాలి
చేతులతో ముట్టుకోరానివి ముట్టుకొన్న పాపం..
కాళ్ళతో ఎన్నో సహ జీవులను చంపిన పాపం..మరో సాటి మనిషిని పొరపాటుగా తొక్కిన పాపం,
ఈ పాపపు కూపమైన ఈ పాడు శరీరం తో, భగవంతుడు ఇచ్చిన అందానికి గర్వించి చేసిన పాపాలు….(బరువైన నిట్టూర్పు)
కర్మవశాత్తు చేసిన పాపాలు (బరువైన నిట్టూర్పు)
మనస్సుతో చేసిన చెప్పుకోలేని..చెప్పనలవి కాని పాపాలు , (బరువైన నిట్టూర్పు)
పాపపు ఆలోచనల పరిభ్రమించిన ఈ దుర్బుద్ధిని మనసారా క్షమించండి మహా దేవా..
అని లెంపలు వేసుకొని..
రెండు చేతులతో రెండు చెవులు పట్టుకొని….శిరస్సుని బాబా పాదాలకు తాకించి కన్నీరు మున్నీరుగా ఆర్ద్రమైన హృదయం తో …. బరువైన నిట్టూర్పులతో, అనుతాపం చెందాలి..
అటు పిమ్మట మళ్ళా ఇల్లాంటి పాపపు పనులు చెయ్యకుండా నా శాయ శక్తులా ప్రయత్నిస్తానని
ఆ శక్తీ , బుద్ధి ప్రసాదించమని వేడుకోవాలి..
( భగవంతుడి కి ఇచ్చిన మాట..మనస్సులో కదలాడిన భావం రెండూ సమానమే..అది మాట తప్పడమే అవుతుంది అనృత దోషం వస్తుంది..)
ఒక్కొక్కసారి ఇతరుల మనస్సులను సంతోష పెట్టడానికి అందమైన అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది..వారి శ్రేయస్సు కోరి..
అటువంటి సమయాల్లో కూడ అసత్య దోషం వాటిల్లకుండా లోక రీతి ప్రభూ అని క్షమాపణ వేడుకొని చెప్పాలి...)
అటు పిమ్మట...
ఉదయం పూజకుపయోగపడిన పూబాలలను మనసారా పలకరించి, వాటి అదృష్టానికి ప్రశంసించి.,..
ఆ త్యాగ గుణం కలగ చేయమని ప్రార్థించి..ఒక క్యారీ బాగ్ లో సర్ది..పరిసరాలు శుభ్ర పరచి..
వింజామర వీచి..
పరమేశ్వరునకు..పాద సంవహన చేస్తూ. …
లోకాల పాలించే ఆ దేవ దేవుని,
ఈ పాప కర్ముల ఆలనా, పాలనలో అలిసిన స్వామి..
నిదురించవయ్యా అని .. జోల పాట పాడి..మన పిల్లలపై మనం కురిపించే ప్రేమలో కొంతైనా ..మనం ఏమీ ఇవ్వకున్నా మనకు అన్నీ అనుగ్రహించే ఆ పెద్దమ్మకు...కొంతైనా స్వాంతన కలిగించడం మనందరి కనీస బాద్యత..
జై శ్రీ సాయి దేవ...
ప్రాధాన్యత, గుర్తుంచుకోండి..ఒక్క సారి 10 సెకెండ్స్ లోపలికి గాలి పీల్చి ఆ సమయం లో భగవన్నామ జపం చేస్తే
చిత్త వృత్తి ఎలా నిశ్చలమవుతుందో గమనించండి..
భగవంతుని చేరే, సంభాషించగలిగే సులువైన మార్గమైన ధ్యానం ...శ్వాస మీదే మీదే ఆధార పడి ఉందని గుర్తించండి..
Be first to comment on this Blog Post!
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|