|
|
Articles: TP Features | ప్రమాదం అంచున ప్రవాసాంధ్రం - Dr. Ramesh Babu Samala
| |
చిత్తూరు జిల్లా నగరికి పది కిలోమీటర్ల దూరంలో తమిళనాడులో ఉన్న అత్తిమాంజేరిపేట పాఠశాలలో తెలుగు, తమిళ మాధ్యమాలు రెండింట్లోనూ నడుస్తున్న ఒక పాఠశాల ఉంది. పన్నెండవ తరగతి వరకూ నడిచే ఈ పాఠశాలలో ప్రతిరోజూ తెలుగుతల్లి ప్రార్థన, తమిళతాయ్ ప్రార్థన అందరూ కలిసే చేస్తారు. ఇన్నేళ్ల నుండీ అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ఎంతో సఖ్యతతో ఉంటూనే ఉన్నారు. అయితే ఇటీవల, సుమారు పది రోజుల క్రితం అక్కడ భాషాపరమైన చిచ్చురేగింది. తెలుగుతల్లి ప్రార్థన చేయకూడదన్నారు. అక్కడ గోడలపై ఉన్న తెలుగు మాటలను చెరిపివేయాలన్నారు. తెలుగు ప్రజలు నిరసన తెలపడంతో పోలీసులు ప్రవేశించి లాఠీచార్జి చేశారు. ఇదంతా తమిళనాడులో ప్రభుత్వ పరంగా తెలుగు పట్ల పెరుగుతున్న అసహనానికి ఒక ఉదాహరణ మాత్రమే.
తమ తల్లి భాష పట్ల ప్రేమను కలిగి ఉండడం సహజమే. కాని పరభాషా ద్వేషం తప్పు. భారతదేశం వంటి బహు భాషా దేశంలో భాష మధ్య చిచ్చు రాకుండా చూసుకోవాలి. తమిళనాడులో దాదాపు నలబయి రెండు శాతం మంది తెలుగు మాతృభాషగా ఉన్న వారే. తెలుగును రాసి చదవగలిగే శక్తి ఉన్నవారు వారిలో పది శాతం కూడా ఉండరు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వల్ల భాష విషయంలో ఇక్కడ మనం సాధించిందేమిటనే సంగతిని పక్కనపెట్టి, ఇప్పుడు తమిళనాడుగా పిలువబడుతున్న ప్రాంతంలో తెలుగువారికి పట్టిన ఈ దౌర్భాగ్య పరిస్థితిని చూస్తే ఎంతో విచారం కలుగుతుంది. మానవహక్కులకు ఎంత భంగం కలిగిస్తుందో తెలుస్తుంది.
మాతృభాషల్ని రక్షించుకోవాలన్న ఐక్యరాజ్యసమితి వారి యునెస్కో సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం పిలుపునిచ్చింది. ఎంత చిన్న జన సముదాయం మాట్లాడుతున్నా, దాని వైవిధ్యాన్ని రక్షించుకోవడం కోసం ఆ భాషను రక్షించడం అత్యవసరమని యునెస్కో ప్రకటించింది. భారత రాజ్యాంగం రచన చేసినప్పుడే 350 అధికరణను పెట్టడం ద్వారా మన రాజ్యాంగవేత్తలు ఈ విషయంలో ఎంతో ముందుచూపు ప్రదర్శించారు. దాని ప్రకారం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో భాషాపరంగా అల్పసంఖ్యాకులుగా ఉన్న పిల్లలకు తమ తల్లి భాషలో ప్రాథమిక విద్యను అభ్యసించే హక్కు ఉంది. అందు కోసం అవసరమైతే భారత రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకొనే వీలు ఉంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|