|
|
Articles: Devotion | అవదూత చర్య - Editor
| |
మహాత్ములందరిలోనూ అవధూతలు అగ్రశ్రేణికి చెదినవారు. నాశము లేకుండుట (అక్షరత్వము) మహోన్నతస్థితి (వరేణ్యత్వము) లేశమైనా కలిగియుండుట - ఇవి అవధూత లక్షణాలని శాస్త్రం చెబుతుంది. వీరు పసిపిల్లలు, పిచ్చివారు, లేక పిశాచగ్రస్తులవలె కన్పిస్తారని ఆదిశంకరులు చెప్పారు. వీరికి తామే దేహమన్న భ్రాంతి వుండదు. సర్వజీవులలోనూ వున్న ఆత్మే తామై వుంటారు. ఈ అవధూత సాంప్రదాయానికి మూలపురుషుడు శ్రీ దత్తాత్రేయుడు. అవధూత లందరిలోని ఆత్మజ్ఞానమే ఆయన. స్నానఘట్టాలెన్ని వున్నా గంగానది ఒక్కటే. అలానే శ్రీ దత్తస్వామి అవధూతలందరి రూపాలలోనూ వుంటారు. అట్టివారిలో శ్రీ వెంకయ్య స్వామి ఒకరు. స్వామి చర్యలు ఎవరికీ అర్ధమయ్యేవికావు.
తరచుగా స్వామి సోమశిల దగ్గర కొండమీద చిన్న గుడిసె వేసుకొని, ఒక నూనెదీపం దగ్గర రాత్రంతా తంబూర మీటుతుండేవారు. ఒకనాటి సాయంకాలం సేవకుడు చలమానాయుడితో అయ్యా, మరో ఇద్దరు మనుష్యులకు అన్నం తీసుకొనిరా! అని చెప్పి తెప్పించారు. నాటి రాత్రి దారి తప్పి ఎన్నో అవస్థలుపడి ఇద్దరు భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. వారికి ముందే స్వామి భోజనం ఏర్పాటు చేశారన్నమాట. అప్పుడప్పుడూ సేవకులతో స్వామి, ఊరిలోకి పోయి ఎవరినైనా అడిగి పాత గుట్టలు తీసుకురావయ్యా! మనకు పనీ గడుస్తుంది! వాళ్ళకూ జబ్బులు పోతాయి అనేవారు. స్వామి తనకు పరిచర్యలు చేసేవారిలో పరదూషణ, కోపము వంటి లోపాలు ఏమాత్రమున్నా వారి సేవను స్వీకరించేవారు కారు. ప్రతిరోజూ ఆ సేవకునిచేత పొగాకు చేతిలో పెట్టించుకునే స్వామి, అలాంటి సమయాలలో క్రిందవేయి, తీసుకుంటాను అనేవారు. ఎవరివద్దనైనా చినిగిపోయిన పాతగుడ్డలు తీసుకొనే వారు గాని, విలువైన గుడ్డలు స్వీకరించేవారు కారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|