|
|
Articles: My Thoughts | శాంతిని హరించే టెర్రర్ - Mr. Narasimham Uppala
| |
విధ్వంసం ఉగ్రవాదుల ఊపిరి. లోక వినాశనానికి ఈ ఊపిరిని ఊదుతూ ఉన్నారు. లోక కల్యాణం కోసం ఎందరో శ్రమిస్తుంటే, త్యాగాలు చేస్తుంటే... ఉగ్రవాదుల వినాశనానికి పూనుకుంటున్నారు.
వీరికి వినాశనం, విధ్వంసం తప్ప మరో లక్ష్యం ఏదీ కనిపించదు. కల్లోలం సృష్టించి, అస్థిరతకు పూనుకోవడమే పనిగా టెర్రరిస్టులు వ్యవహరిస్తున్నారు.
మాన్యతలేని, మతిలేని పనులకు పవిత్రత అంటగట్టి వీరోచిత చర్యలుగా తమకుతాము గొప్పలు పోవడం ఏమాత్రం వివేకమనిపించదు. ఉగ్రవాదానికి తమవారు సైతం ఘోరంగా బలవుతున్నారనే సంగతిని కూడా వారి మస్తిష్కాలకు ఎక్కడం లేద. మొన్న ముంబయ్ పై జరిగిన 'యుద్ధం'లో ఉగ్రవాదులకు చెందిన మతంవాళ్లు సైతం అసువులు బాశారు.
అమెరికా, బ్రిటీషు, ఇజ్రాయిల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని భారతదేశపు వాణిజ్య కేంద్రంపై దాడికి పాల్పడటం ఉన్మత్తచర్య తప్ప మరొకటి అవదు. తుపాకులు, మందుగుండు సామాగ్రితో దాడులు చేసి రెండు వందల మందిని పొట్టన పెట్టుకుని మరో మూడువందల మందిని క్షతగాత్రులను చేసి వారు బావుకున్నది ఏమిటి?... శూన్యం!
ప్రజాస్వామ్యాలలో ఇలాంటి హింసకూ విధ్వంసానికీ ఆదరణ లభించదు. ఉగ్రవాదులైనా, తీవ్రవాదులైనా తమ డిమాండ్లను ఇలాంటి ఉన్మత్త చర్యల ద్వారా సాధించలేరు. ఒకదేశాన్ని, ఒక ప్రాంతాన్ని బలహీన పరుస్తామని భావించినా అది సాధ్యంకాని పని.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|