|
|
Articles: TP Features | లెక్క తేల్చేది కులాలే! - Site Administrator
| |
- దుర్గం రవీందర్
రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం ప్రచారహోరు ఉచ్ఛస్థితికి చేరింది. టిక్కెట్ల పంపిణీ, రెబెల్స్ గొడవలు, రాజీనామాలు, నిష్క్రమణలు, ఆరోపణలు, హామీలు, మ్యానిఫెస్టోల ఘట్టాలు ముగిసిపోయాయి.
సరాసరి ఒక్కో శాససనభ నియోజకవర్గంలో దాదాపు 6-7 పార్టీలు 12 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పార్లమెంటుకు 11 మంది పోటీ చేస్తున్నారు. కులాలు, మతాలవారీగా ఆయా పార్టీల టిక్కెట్ల పంపకం పూర్తి అయ్యింది. రాష్ట్రంలో మునుపెన్నడూ ఇన్ని పార్టీలు పోటీ చేయలేదు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెడ్డి కులస్థులకు పెద్ద పీట వేస్తూ దాదాపు 90 అసెంబ్లీ స్థానాల్లో బీ-ఫారాలను ఇచ్చింది. 18 మంది కమ్మవారికి, 8 మంది వెలమలకు, 6గురు రాజులకు, 15 మంది కాపులకు, 4గురు బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇచ్చింది. మరో ఐదుగురు వైశ్యులకు టిక్కెట్లు, మొత్తం మీద 147 టిక్కెట్లను అగ్రకులాల వారికి ఇచ్చింది. బీసీలకు 67 టిక్కెట్లు, ముస్లీంలకు 11 టిక్కెట్లు, క్రిష్టియన్ లలో ఒకరిద్దరికి టిక్కెట్లు ఇచ్చింది. ఎవరు ఏమనుకున్నా ఫరవాలేదు గెలుపు ఓటములకు పూర్తి బాధ్యత నేనే వహిస్తానని అధిష్టానాన్ని ఒప్పించి ధైర్యంగా ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తనదైన రీతిలో టిక్కెట్లను పంచారు. అందరికన్నా ముందు మొత్తం జాబితాను విడుదల చేశారు.
మేం గతంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చాము. చెప్పినవి చేశాము, చెప్పనవి చేశాం. మా సంక్షేమ పథకాలు అన్నింటినీ కొనసాగిస్తాము అని వై.ఎస్.ప్రచారంలో ప్రముఖంగా పేర్కొంటున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ గృహాలు, బీసీలకు స్కాలర్ షిప్స్, వృద్ధాప్య పింఛన్ లు, రెండు రూపాయలకు కిలో బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇత్యాది పథకాలను మరింత సమర్ధవంతంగా నెరువేరుస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. తన పనితనాన్ని చూసి ఓటు వేయమని ధైర్యంగా ఓట్లు అడుగుతున్నారు. ముఖ్యమంత్రిగా ఏం చేయగలడో ఆ పనులను ఆయన ధైర్యంగా చేశారు. సాహసవంతమైన నిర్ణయాలు, నమ్మినవారిని అందలం ఎక్కించడం లాంటి పనులను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనే రీతిలో చేశారు.
తెలంగాణా పట్ల మాట దాట వేసిన వైనం, జలయజ్ఞంలో అవినీతి, రంగారెడ్డి జిల్లా భూముల బూమ్ లో కడప, రాయలసీమ వారికి లాభం కలిగేలా ప్రవర్తించడం, వోక్స్వాగన్, సెజ్ ల పొగ, మాదిగల అలక, ఎవరు ఏమనుకున్నా పరవాలేదని తన వారికందరికీ అర్హతలు మరచి హోదాలను కట్టబెట్టడం ఆయనకే చెల్లింది. కాని, సరసాదేవి, సూరీడుల డిపెప్ కుంభకోణం, పరిటాల రవి హత్య, మొద్దు శ్రీను హత్య, ఏ.సి.బి. కేసుల్లో దొరికినవారిని మళ్ళీ అధికారంలోకి రానివ్వడం లాంటి మొండి నిర్ణయాలు ఆయన పనితాన్ని జడ్జ్ చేయడంలో ఓటర్ పై ప్రభావం చూపనున్నాయి. ఇన్ని రోజులు పనిగట్టుకుని ప్రచారం చేసిన 'ఆ రెండు పత్రికలు' ఒక టీవీ చానల్ ప్రచారం పూర్తిగా నిర్వీర్యం కాకపోవచ్చు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|